రక్తదానం చేసే వారు సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ ను సంప్రదించాలని డీబీబీఎస్ వినతి
- November 22, 2020
మస్కట్: రక్తదానం చేసే వాళ్లు బౌషర్ లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ ను సంప్రదించాలని బ్లడ్ బ్యాంక్స్ సర్వీస్ డిపార్ట్మెంట్-డీబీబీఎస్ సూచించింది. ఈ వారం రోజుల్లో తాము బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలను నిర్వహించలేమని డీబీబీఎస్ స్పష్టం చేసింది. అయితే..రక్తదానం చేయాలనుకునే వారు డీబీబీఎస్ కు ప్రత్యామ్నాయంగా బౌషర్ లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ కేంద్రాలను సంప్రదించాలని డీబీబీఎస్ సూచించింది. తమకు 100 నుంచి 120 వరకు బ్లడ్ యూనిట్స్ అవసరం అవుతానయని కూడా వివరించింది. రక్తదానం చేయాలని అనుకునే వాళ్లు 94555648 నెంబర్ కు తమ వివరాలను వాట్సాప్ చేయాలని కోరింది. వాట్సాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న రక్తదాతలు తమ పూర్తి పేరు, రక్తదానం చేసే రోజు, సమయం వంటి వివరాలతో పాటు సివిల్ ఐడీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే దాతలు ప్లాస్మా దాతలా, ప్లేలెట్స్ దాతలా, రక్తదాతలా అనే వివిరాలు కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









