అందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ..సౌదీ అరేబియా ప్రకటన
- November 24, 2020
రియాద్:కింగ్డమ్ పరిధిలోని దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందించనున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. దేశ ప్రజల ఆరోగ్య సంక్షరణను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరా చేస్తోందని, ప్రజలకు వ్యాక్సిన్ ను అందించటాన్ని వ్యాపారంగా తాము భావించటం లేదని సౌదీ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ అబ్దుల్లా అల్ అసిరి వెల్లడించారు. వచ్చే ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 70 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించగలమని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. అయితే..వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ ప్రధాన్యత క్రమంలో ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 16 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ అందించకపోవటమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలిపారు. జీ20 సభ్య దేశాల్లో దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి సమర్ధవంతమైన చర్యల్లో సౌదీ అరేబియా ఒకటని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!
- అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల తగ్గింపు..!!
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్









