వారికి కోవిడ్ వ్యాక్సిన్ అవసరం లేదు..
- November 24, 2020
కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వారి శరీరంలో కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే వ్యాధి నిరోధక కణాలు సరిపడా తయారై ఉంటాయి. కాబట్టి వీరికి పదే పదే వ్యాక్సినేషన్ కూడా అవసరం ఉండదని అంటున్నారు అధ్యయనకారులు. పలువురు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు 19 నుంచి 81 ఏళ్ల మధ్య వయసులో ఉన్న185 కోవిడ్ బాధితుల నుంచి రక్తాన్ని సేకరించి పరీక్షించారు. ఆ అధ్యయనంలో వారి శరీరాల్లో వైరస్తో సమర్ధంగా పోరాడే బీ, టీ లింపోసైట్ కణాల సంఖ్య విపరీతంగా పెరిగినట్లు కనిపించింది. ఇలా పెరిగిన కణాలు ఏళ్ల తరబడి శరీరాల్లో ఉండి, శరీరాన్ని రీ ఇన్ఫెక్షన్కు గురి కాకుండా కాపాడతాయి. అలాగే వీరి శరీరాల్లో కోవిడ్ వైరస్కు సంహకరించే క్రమంలో తయారయ్యే యాంటీబాడీలు కూడా ఆలస్యంగా అంతరిస్తున్న్లట్లు వారు గమనించారు. కోలుకున్న వ్యక్తుల్లోని రోగనిరోధక వ్యవస్థ వైరస్ ఎప్పుడు దాడి చేసినా పోరాడే శక్తిని కలిగి ఉంటుందని అన్నారు. ఫలితంగా వైరస్తో కూడిన వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గే వీలుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ తరహా రోగ నిరోధక వ్యవస్థ ఎన్నేళ్లు ఉంటుందనేది కచ్చితంగా చెప్పడం కష్టం అని అన్నారు.
తాజా వార్తలు
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన
- UTS యాప్ సేవలు బంద్..
- మలేషియాకు బయలుదేరిన ప్రధాని మోదీ









