రెసిడెన్సీ పర్మిషన్ ఉల్లంఘనులు డిసెంబర్ 31 స్టేటస్ చెక్ చేసుకోవాలన్న కువైట్
- November 25, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని ప్రవాసీయులు, విజిట్ విసాదారుల రెసిడెన్సీ పర్మిషన్ కు సంబంధించి కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్సీ అనుమతుల గడువు ముగిసిన వారు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 నాటికల్లా తమ స్టేటస్ ను తనిఖీ చేసుకోవాలని సూచించింది. గడువు ముగిసన వారు నివాస అనుమతుల ఉల్లంఘన కింద జనవరి 1, లేదా అంతకుముందే ఫైన్ చెల్లించి తగిన అనుమతులు పొందాలని తెలిపింది. ఒకవేళ దేశం విడిచి వెళ్లాలని అనుకుంటే...తప్పనిసరిగా ఫైన్ చెల్లించి ప్రయాణానికి సంబంధించి క్లియరెన్స్ పత్రాలను పొందాలని వివరించింది. నిర్ణీత గడువులోగా జరిమానాలు చెల్లించిన వారు మాత్రమే భవిష్యత్తులో తిరిగి కువైట్ చేరుకునేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఒకవేళ నిర్ణీత సమయంలో ఫైన్ చెల్లించకుంటే వారికి భవిష్యత్తులో కువైట్ తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వబోమని కూడా హెచ్చరించింది. ఇక ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో విజిట్ వీసాదారుల వీసా ఆటోమెటిగ్గా రెన్యూవల్ అవుతుందని, అయితే..తాత్కాలిక రెసిడెన్సీ అనుమతులను మాత్రం అందుకు అనుగుణంగా సవరించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ నెలాఖరు నాటికి దేశం విడిచి వెళ్లాలని సూచించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!
- కువైట్ విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధం..భద్రతకు ప్రాధాన్యత..!!
- ఆస్తమా పై అవగాహనకు ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కార్యాచరణ..!!
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ









