రెసిడెన్సీ పర్మిషన్ ఉల్లంఘనులు డిసెంబర్ 31 స్టేటస్ చెక్ చేసుకోవాలన్న కువైట్
- November 25, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని ప్రవాసీయులు, విజిట్ విసాదారుల రెసిడెన్సీ పర్మిషన్ కు సంబంధించి కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్సీ అనుమతుల గడువు ముగిసిన వారు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 నాటికల్లా తమ స్టేటస్ ను తనిఖీ చేసుకోవాలని సూచించింది. గడువు ముగిసన వారు నివాస అనుమతుల ఉల్లంఘన కింద జనవరి 1, లేదా అంతకుముందే ఫైన్ చెల్లించి తగిన అనుమతులు పొందాలని తెలిపింది. ఒకవేళ దేశం విడిచి వెళ్లాలని అనుకుంటే...తప్పనిసరిగా ఫైన్ చెల్లించి ప్రయాణానికి సంబంధించి క్లియరెన్స్ పత్రాలను పొందాలని వివరించింది. నిర్ణీత గడువులోగా జరిమానాలు చెల్లించిన వారు మాత్రమే భవిష్యత్తులో తిరిగి కువైట్ చేరుకునేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఒకవేళ నిర్ణీత సమయంలో ఫైన్ చెల్లించకుంటే వారికి భవిష్యత్తులో కువైట్ తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వబోమని కూడా హెచ్చరించింది. ఇక ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో విజిట్ వీసాదారుల వీసా ఆటోమెటిగ్గా రెన్యూవల్ అవుతుందని, అయితే..తాత్కాలిక రెసిడెన్సీ అనుమతులను మాత్రం అందుకు అనుగుణంగా సవరించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ నెలాఖరు నాటికి దేశం విడిచి వెళ్లాలని సూచించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- దుబాయ్ స్కూళ్లలో ఏఐ (AI) పాఠాలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం







