బహ్రెయిన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి
- November 25, 2020
మనామా:ఆరు రోజుల విదేశీ పర్యటలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ బహ్రెయిన్ చేరుకున్నారు. మంత్రితో పాటు బహ్రెయిన్ చేరుకున్న పలువురు ఉన్నతాధికారులకు ఆ దేశ విదేశాంగ శాఖ, అంతర్జాతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. బహ్రెయిన్ దివంగత ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ బిన్ ఖలీఫా మృతికి భారత ప్రభుత్వం, ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలుపనున్నారు. అలాగే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలు, ఇరు దేశాల ప్రయోజనాలకు సంబంధించి చర్చించనున్నారు. బహ్రెయిన్ పర్యటన తర్వాత భారత విదేశాంగమంత్రి యూఏఈ చేరుకుంటారు. 26న యూఏఈ పర్యటన ముగుస్తుంది. ఆ తర్వాత27 నుంచి 28 వరకు సీషెల్స్ లో భారత విదేశాంగమంత్రి పర్యటిస్తారు.
తాజా వార్తలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
- హైదరాబాద్లో ఆపిల్ రిటైల్ స్టోర్..
- పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!







