భారత్, పాకిస్తాన్ వెళ్లే ఫ్లైట్స్ లో 50కిలోల వరకు లగేజీ ఫ్రీ...ఎతిహాద్ అఫర్

- November 26, 2020 , by Maagulf
భారత్, పాకిస్తాన్ వెళ్లే ఫ్లైట్స్ లో 50కిలోల వరకు లగేజీ ఫ్రీ...ఎతిహాద్ అఫర్

అబుధాబి నుంచి భారత్, పాకిస్తాన్ వెళ్లే ప్రయాణికులు లగేజీ అలవెన్స్ పెంచింది ఎతిహాద్ ఎయిర్ వేస్. డిసెంబర్ 9 వరకు తమ ఎయిర్ లైన్స్ ప్రయాణించే ప్రయాణికులు 50 కిలోల వరకు లగేజ్ ని ఫ్రీ తీసుకెళ్లొచ్చని ఆఫర్ ప్రకటించింది. ఎకనామి, బిజినెస్ క్లాస్ ప్రయాణికులు ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్ తో పాటు అబుధాబి నుంచి  కైరో, అమ్మన్, బీరట్, ఢాక వెళ్లే ప్రయాణికులకు కూడా లగేజ్ అఫర్ వర్తించనుంది. సాధారణంగా యూఏఈలోని విమానయాన సంస్థలు చెక్డ్ బ్యాకేజీని 20 కేజీల నుంచి 40 కేజీల వరకు ఆఫర్ చేస్తుంటాయి. ఇదిలాఉంటే..ఫ్లైట్స్ కనెక్ట్ సమయంలో బ్యాగేజీ ఆఫర్ లను గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com