బహ్రెయిన్ ప్రధానితో భారత విదేశాంగ మంత్రి భేటీ..
- November 26, 2020
మనామా:రెండు రోజుల బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ దివంగత ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మృతికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తరపున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం..ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. కోవిడ్ నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పరస్పరం సహకరించుకుంటున్న ఇరు దేశాలు భవిష్యత్తులోనూ అదే పంథాను కొనసాగించాలని బహ్రెయిన్ రాజు ఆకాంక్షించారు. అలాగే పలు రంగాల్లో పురోభివృద్ధి సాధించే దిశగా అవసరమైన సాయం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. అవకాశం ఉన్న రంగాల్లో అవసరమైన మేర పెట్టుబడులను విస్తరించుకోవాలని అభిలాషించారు. మరోవైపు బహ్రెయిన్ అభివృద్ధిలో ఆర్ధిక ఎదుగుదలలో ప్రవాస భారతీయుల కృషిని, భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు. ఇదిలాఉంటే..బహ్రెయిన్ ప్రధాని, భారత విదేశాంగ శాఖ మంత్రి మధ్య ఇరు దేశాలపై ప్రభావం చూపే పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







