కోవిడ్ 19: 215 మందికి వైరస్..ఖతార్ లో పెరుగుతున్న రికవరి రేటు

- November 26, 2020 , by Maagulf
కోవిడ్ 19: 215 మందికి వైరస్..ఖతార్ లో పెరుగుతున్న రికవరి రేటు

ఖతార్ లో కోవిడ్ బారిన పడుతున్న వ్యక్తులతో పాటు వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 215 మందికి కరోనా వైరస్ సోకగా..248 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఖతార్ లో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,35,198కి చేరింది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసులలో 171 కమ్యూనిటీ కేసులు కాగా, 44 మంది విదేశీ ప్రయాణికులు ఉన్నట్లు వివరించారు. ఇప్పటివరకు 1,38,066 మందికి కోవిడ్ సోకగా..2,631 మందికి ప్రస్తుతం పలు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com