రియాద్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద దొరికిన 369.8 గ్రాముల బంగారం
- November 26, 2020
హైదరాబాద్ కస్టమ్స్ డిపార్ట్మెంట్కి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఇద్దరు ప్రయాణీకులపై గోల్డ్ స్మగ్లింగ్ కేసులు నమోదు చేశారు. ఈ ఇద్దరూ రియాద్ నుంచి జి8 7000 నెంబర్ విమానంలో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వీరి వద్ద నుంచి మూడు గోల్డ్ బార్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన పాకెట్స్లో నిందితులు ఈ గోల్డ్ బార్స్ని వుంచి స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ప్రయాణీకుడు 184.9 గ్రాముల బంగారాన్ని స్మగుల్ చేశాడు. ఇద్దరి నుంచి 369.8 గ్రాముల బంగారం అధికారులకు దొరికింది. ఈ బంగారం విలువ 18,07,950 రూపాయలు వుంటుందని అంచనా వేశారు. కేసు విచారణ జరుగుతోంది.

తాజా వార్తలు
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!









