రియాద్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద దొరికిన 369.8 గ్రాముల బంగారం
- November 26, 2020
హైదరాబాద్ కస్టమ్స్ డిపార్ట్మెంట్కి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఇద్దరు ప్రయాణీకులపై గోల్డ్ స్మగ్లింగ్ కేసులు నమోదు చేశారు. ఈ ఇద్దరూ రియాద్ నుంచి జి8 7000 నెంబర్ విమానంలో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వీరి వద్ద నుంచి మూడు గోల్డ్ బార్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన పాకెట్స్లో నిందితులు ఈ గోల్డ్ బార్స్ని వుంచి స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ప్రయాణీకుడు 184.9 గ్రాముల బంగారాన్ని స్మగుల్ చేశాడు. ఇద్దరి నుంచి 369.8 గ్రాముల బంగారం అధికారులకు దొరికింది. ఈ బంగారం విలువ 18,07,950 రూపాయలు వుంటుందని అంచనా వేశారు. కేసు విచారణ జరుగుతోంది.

తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







