రియాద్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద దొరికిన 369.8 గ్రాముల బంగారం
- November 26, 2020
హైదరాబాద్ కస్టమ్స్ డిపార్ట్మెంట్కి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఇద్దరు ప్రయాణీకులపై గోల్డ్ స్మగ్లింగ్ కేసులు నమోదు చేశారు. ఈ ఇద్దరూ రియాద్ నుంచి జి8 7000 నెంబర్ విమానంలో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వీరి వద్ద నుంచి మూడు గోల్డ్ బార్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన పాకెట్స్లో నిందితులు ఈ గోల్డ్ బార్స్ని వుంచి స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ప్రయాణీకుడు 184.9 గ్రాముల బంగారాన్ని స్మగుల్ చేశాడు. ఇద్దరి నుంచి 369.8 గ్రాముల బంగారం అధికారులకు దొరికింది. ఈ బంగారం విలువ 18,07,950 రూపాయలు వుంటుందని అంచనా వేశారు. కేసు విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు