ట్రాకింగ్ బ్రాస్లెట్ తొలగించిన ఒమనీ..కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిందుకు జరిమానా, జైలుశిక్ష
- November 27, 2020
కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణలో భాగమైన క్వారంటైన్ రూల్స్ ను బ్రేక్ చేసిన వ్యక్తికి 20 రోజుల జైలు శిక్ష పడింది. అలాగే వెయ్యి ఒమనీ రియాల్స్ ఫైన్ పడింది. ఒమన్ లోని అల్ బాటిన సౌత్ గవర్నరేట్ లోని కోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది. ఒమన్ కు చెందిన నిందితుడు డొమస్టిక్ క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించటంతో పాటు చేతికి వేసిన ట్రాకింగ్ బ్రాస్లెట్ ను కూడా తొలగించాడు. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కోవిడ్ మహమ్మారిని నియంత్రించేందుకు నిబంధనల అమలు విషయంలో కఠినంగా ఉంటామని ఒమన్ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. సుప్రీం కమిటీ జారీ చేసిన మార్గనిర్దేశకాలను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని గతంలోనే సూచించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు పాటించకుండా దుస్సాహాసానికి పాల్పడితే తీవ్రతను బట్టి జరిమానా, జైలు శిక్షతో పాటు మీడియాలో వారి ఫోటో ప్రచురించి నేమ్ షేమ్ చేస్తామని కూడా హెచ్చరించింది. అయినా..ఓ ఒమనీ మాత్రం అధికారుల హెచ్చరికలను ఖాతారు చేయలేదు. డొమస్టిక్ క్వారంటైన్ ఉండాల్సిన వ్యక్తి రూల్స్ బ్రేక్ చేశాడు. పైగా ట్రాకింగ్ బ్రాస్లెట్ ను తీసిపారేశాడు. అధికారులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన కోర్టు...ఎలాంటి సంజాయిషీ లేకుండా నిందితుడ్ని 20 రోజుల పాటు జైలులో పెట్టాలని తీర్పునిచ్చింది. వెయ్యి రియాల్స్ జరిమానాతో పాటు సమాజానికి ముప్పు కలిగించేలా వ్యవహరించిన అతని ఫోటోను మీడియాలో ప్రచురించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







