వచ్చే ఏడాది కువైట్‌ని వీడనున్న 70,000 మంది వలసదారులు

- November 28, 2020 , by Maagulf
వచ్చే ఏడాది కువైట్‌ని వీడనున్న 70,000 మంది వలసదారులు

కువైట్ సిటీ:70,000 మందికి పైగా వలసదారులు వచ్చేఏడాది కువైట్‌ని వీడనున్నారు. డిగ్రీ పట్టా లేని 60 ఏళ్ళు పైబడినవారికి రెసిడెన్సీని రెన్యువల్‌ చేయడానికి కువైట్‌ అథారిటీస్‌ నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ కోవలోకి వచ్చేవారంతా దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుంది. జనవరి 1 నుంచి రెన్యువల్‌ గడువు ముగుస్తుంది గనుక, అప్పటి నుంచే ఆ కేటగిరీలోకి వచ్చేవారు దేశం విడిచి వెళ్ళక తప్పదు. సుమారుగా 70 వేల మంది ఈ కేటగిరీలోకి వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, తమ పిల్లలు కువైట్‌లో పనిచేస్తూ వుంటే, ఫ్యామిలీ వీసా కింద ఆయా వ్యక్తులు తమ రెసిడెన్సీ స్టేటస్‌ని మార్చుకుని, కువైట్‌లో వుండడానికి అవకాశం వుంటుంది. అయినాగానీ, 70 వేల మంది దేశం విడిచి వెళ్ళక తప్పకపోవచ్చు.  

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com