వచ్చే ఏడాది కువైట్ని వీడనున్న 70,000 మంది వలసదారులు
- November 28, 2020
కువైట్ సిటీ:70,000 మందికి పైగా వలసదారులు వచ్చేఏడాది కువైట్ని వీడనున్నారు. డిగ్రీ పట్టా లేని 60 ఏళ్ళు పైబడినవారికి రెసిడెన్సీని రెన్యువల్ చేయడానికి కువైట్ అథారిటీస్ నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ కోవలోకి వచ్చేవారంతా దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుంది. జనవరి 1 నుంచి రెన్యువల్ గడువు ముగుస్తుంది గనుక, అప్పటి నుంచే ఆ కేటగిరీలోకి వచ్చేవారు దేశం విడిచి వెళ్ళక తప్పదు. సుమారుగా 70 వేల మంది ఈ కేటగిరీలోకి వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, తమ పిల్లలు కువైట్లో పనిచేస్తూ వుంటే, ఫ్యామిలీ వీసా కింద ఆయా వ్యక్తులు తమ రెసిడెన్సీ స్టేటస్ని మార్చుకుని, కువైట్లో వుండడానికి అవకాశం వుంటుంది. అయినాగానీ, 70 వేల మంది దేశం విడిచి వెళ్ళక తప్పకపోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







