వచ్చే ఏడాది కువైట్ని వీడనున్న 70,000 మంది వలసదారులు
- November 28, 2020
కువైట్ సిటీ:70,000 మందికి పైగా వలసదారులు వచ్చేఏడాది కువైట్ని వీడనున్నారు. డిగ్రీ పట్టా లేని 60 ఏళ్ళు పైబడినవారికి రెసిడెన్సీని రెన్యువల్ చేయడానికి కువైట్ అథారిటీస్ నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ కోవలోకి వచ్చేవారంతా దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుంది. జనవరి 1 నుంచి రెన్యువల్ గడువు ముగుస్తుంది గనుక, అప్పటి నుంచే ఆ కేటగిరీలోకి వచ్చేవారు దేశం విడిచి వెళ్ళక తప్పదు. సుమారుగా 70 వేల మంది ఈ కేటగిరీలోకి వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, తమ పిల్లలు కువైట్లో పనిచేస్తూ వుంటే, ఫ్యామిలీ వీసా కింద ఆయా వ్యక్తులు తమ రెసిడెన్సీ స్టేటస్ని మార్చుకుని, కువైట్లో వుండడానికి అవకాశం వుంటుంది. అయినాగానీ, 70 వేల మంది దేశం విడిచి వెళ్ళక తప్పకపోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







