వచ్చే ఏడాది కువైట్ని వీడనున్న 70,000 మంది వలసదారులు
- November 28, 2020
కువైట్ సిటీ:70,000 మందికి పైగా వలసదారులు వచ్చేఏడాది కువైట్ని వీడనున్నారు. డిగ్రీ పట్టా లేని 60 ఏళ్ళు పైబడినవారికి రెసిడెన్సీని రెన్యువల్ చేయడానికి కువైట్ అథారిటీస్ నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ కోవలోకి వచ్చేవారంతా దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుంది. జనవరి 1 నుంచి రెన్యువల్ గడువు ముగుస్తుంది గనుక, అప్పటి నుంచే ఆ కేటగిరీలోకి వచ్చేవారు దేశం విడిచి వెళ్ళక తప్పదు. సుమారుగా 70 వేల మంది ఈ కేటగిరీలోకి వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, తమ పిల్లలు కువైట్లో పనిచేస్తూ వుంటే, ఫ్యామిలీ వీసా కింద ఆయా వ్యక్తులు తమ రెసిడెన్సీ స్టేటస్ని మార్చుకుని, కువైట్లో వుండడానికి అవకాశం వుంటుంది. అయినాగానీ, 70 వేల మంది దేశం విడిచి వెళ్ళక తప్పకపోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







