భారత్ లో 94 లక్షలకు చేరువలో కరోనా కేసులు...
- November 29, 2020
న్యూఢిల్లీ : భారత దేశంలో కరోనా కేసులు 94 లక్షల చేరువలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 41,810 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తంగా వైరస్ కేసులు 93,92,919కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 496 మందిని కరోనా బలితీసుకుంది. దీంతో మొత్తంగా మృతుల సంఖ్య 1, 36, 696కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. 42,298 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 88,02,267 మంది ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం 4,53,956 యాక్టివ్ కేసులున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 13,95,03,803 మందికి పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో కేరళలో అత్యధికంగా 6,250 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 5,900 కేసులు నమోదు కాగా...ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 18 లక్షల మంది కరోనా బారిన పడ్డారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు