యూఏఈ: అక్మస్మాత్తుగా లేన్లు మార్చితే Dh1000 ఫైన్...4 బ్లాక్ పాయింట్స్
- November 30, 2020
యూఏఈ:రోడ్లపై అకస్మాత్తుగా టర్నింగ్ తీసుకునే వాహనదారులపై మరింత నిఘా పెంచనున్నట్లు షార్జా పోలీస్ విభాగంలోని ట్రాఫిక్, పెట్రోలింగ్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఇందుకోసం 'రషీద్' స్పీడ్ రాడర్స్ కు మరింత అధునాతనను జోడిస్తూ అప్ గ్రేడ్ చేసినట్లు వెల్లడించారు. సడెన్ ఒక లేన్ నుంచి మరో లేన్ కు వాహనాలను మళ్లీంచటం..అకస్మాత్తుగా టర్న్ చేయటం ప్రమాదాలకు ఆస్కారం ఇస్తోందన్నారు. హైవేలపై జరుగుతున్న ప్రమాదాల్లో సడెన్ టర్నింగ్ ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ప్రతీ వాహనదారుడు తమ వాహనాన్ని మళ్లించే ముందు...అవతలి లేన్లో ఇతర వాహనాలు వస్తున్నాయో లేదో ఓ సారి చెక్ చేసుకోవాలని, లేన్ మార్చే సమయంలో విధిగా ఇండికేటర్ వేయాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా హైవేలపై మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. నిబంధనలను పాటించకుండా ప్రమాదాలకు కారణమయ్యేలా నిబంధనలు ఉల్లంఘించే వారిని స్పీడ్ రాడార్స్ ద్వారా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సడెన్ టర్న్ తీసుకునే వారికి Dh 1000 ఫైన్ తో పాటు 4 బ్లాక్ పాయింట్లు ఇస్తామని పోలీసులు హెచ్చరించారు. ా
తాజా వార్తలు
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!







