యూఏఈ: అక్మస్మాత్తుగా లేన్లు మార్చితే Dh1000 ఫైన్...4 బ్లాక్ పాయింట్స్
- November 30, 2020
యూఏఈ:రోడ్లపై అకస్మాత్తుగా టర్నింగ్ తీసుకునే వాహనదారులపై మరింత నిఘా పెంచనున్నట్లు షార్జా పోలీస్ విభాగంలోని ట్రాఫిక్, పెట్రోలింగ్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఇందుకోసం 'రషీద్' స్పీడ్ రాడర్స్ కు మరింత అధునాతనను జోడిస్తూ అప్ గ్రేడ్ చేసినట్లు వెల్లడించారు. సడెన్ ఒక లేన్ నుంచి మరో లేన్ కు వాహనాలను మళ్లీంచటం..అకస్మాత్తుగా టర్న్ చేయటం ప్రమాదాలకు ఆస్కారం ఇస్తోందన్నారు. హైవేలపై జరుగుతున్న ప్రమాదాల్లో సడెన్ టర్నింగ్ ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ప్రతీ వాహనదారుడు తమ వాహనాన్ని మళ్లించే ముందు...అవతలి లేన్లో ఇతర వాహనాలు వస్తున్నాయో లేదో ఓ సారి చెక్ చేసుకోవాలని, లేన్ మార్చే సమయంలో విధిగా ఇండికేటర్ వేయాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా హైవేలపై మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. నిబంధనలను పాటించకుండా ప్రమాదాలకు కారణమయ్యేలా నిబంధనలు ఉల్లంఘించే వారిని స్పీడ్ రాడార్స్ ద్వారా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సడెన్ టర్న్ తీసుకునే వారికి Dh 1000 ఫైన్ తో పాటు 4 బ్లాక్ పాయింట్లు ఇస్తామని పోలీసులు హెచ్చరించారు. ా
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







