పర్యాటక వీసాల జారీకి ఒమన్ సుప్రీమ్ కమిటీ గ్రీన్ సిగ్నల్
- November 30, 2020
మస్కట్:దేశంలో పర్యాటక రంగానికి మద్దతుగా ఒమన్ సుప్రీమ్ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలోకి పలు దేశాల నుంచి వచ్చే పర్యాటకులను అనుమతించేందుకు కమిటీ అంగీకరించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీమ్ కమిటీ...దేశంలో కోవిడ్ పరిస్థితులను సమీక్షించి విజిట్ వీసాల జారీకి సమ్మతి తెలిపింది. దీంతో సుల్తానేట్ పరిధిలో ఎక్కడికైనా పర్యాటకులకు పర్మిషన్ లభించనుంది. అయితే...పర్యాటక రంగంలోని హోటళ్లు, టూరిజం కంపెనీల పరిధిలో తగిన ఏర్పాట్లు ఉండాలని ఉండాలని సూచించింది. ఇదిలాఉంటే..కార్మికుల కొరత, ఉద్యోగుల సంఖ్య కుదింపు వంటి చర్యల కారణంగా అవరోధాలు ఎదుర్కుంటున్న పనులను నిలిపివేయాలని కూడా కమిటీ నిర్ణయించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







