పర్యాటక వీసాల జారీకి ఒమన్ సుప్రీమ్ కమిటీ గ్రీన్ సిగ్నల్
- November 30, 2020
మస్కట్:దేశంలో పర్యాటక రంగానికి మద్దతుగా ఒమన్ సుప్రీమ్ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలోకి పలు దేశాల నుంచి వచ్చే పర్యాటకులను అనుమతించేందుకు కమిటీ అంగీకరించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీమ్ కమిటీ...దేశంలో కోవిడ్ పరిస్థితులను సమీక్షించి విజిట్ వీసాల జారీకి సమ్మతి తెలిపింది. దీంతో సుల్తానేట్ పరిధిలో ఎక్కడికైనా పర్యాటకులకు పర్మిషన్ లభించనుంది. అయితే...పర్యాటక రంగంలోని హోటళ్లు, టూరిజం కంపెనీల పరిధిలో తగిన ఏర్పాట్లు ఉండాలని ఉండాలని సూచించింది. ఇదిలాఉంటే..కార్మికుల కొరత, ఉద్యోగుల సంఖ్య కుదింపు వంటి చర్యల కారణంగా అవరోధాలు ఎదుర్కుంటున్న పనులను నిలిపివేయాలని కూడా కమిటీ నిర్ణయించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!
- యూఏఈలో భారీగా డ్రగ్స్ సీజ్..13మంది అరెస్టు..!!
- ప్రోగ్రామింగ్ లోపం..సౌదీలో హ్యుందాయ్ వెహికిల్స్ రీకాల్..!!
- మే 7వరకు ఒమన్ లో సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు..!!
- కువైట్లో ట్రాఫిక్ మార్పులు: ఐదవ రింగ్ రోడ్డుపై 14 రోజుల పాటు లేన్లు మూసివేత
- NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు రెండు సంవత్సరాల రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు
- మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!









