పర్యాటక వీసాల జారీకి ఒమన్ సుప్రీమ్ కమిటీ గ్రీన్ సిగ్నల్
- November 30, 2020
మస్కట్:దేశంలో పర్యాటక రంగానికి మద్దతుగా ఒమన్ సుప్రీమ్ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలోకి పలు దేశాల నుంచి వచ్చే పర్యాటకులను అనుమతించేందుకు కమిటీ అంగీకరించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీమ్ కమిటీ...దేశంలో కోవిడ్ పరిస్థితులను సమీక్షించి విజిట్ వీసాల జారీకి సమ్మతి తెలిపింది. దీంతో సుల్తానేట్ పరిధిలో ఎక్కడికైనా పర్యాటకులకు పర్మిషన్ లభించనుంది. అయితే...పర్యాటక రంగంలోని హోటళ్లు, టూరిజం కంపెనీల పరిధిలో తగిన ఏర్పాట్లు ఉండాలని ఉండాలని సూచించింది. ఇదిలాఉంటే..కార్మికుల కొరత, ఉద్యోగుల సంఖ్య కుదింపు వంటి చర్యల కారణంగా అవరోధాలు ఎదుర్కుంటున్న పనులను నిలిపివేయాలని కూడా కమిటీ నిర్ణయించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







