ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత
- December 01, 2020
హైదరాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుండి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆయన అపోల ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి విషయం తెలిసి పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
1999, 2004లో సీపీఎం తరపున విజయం సాధించిన ఆయన 2013లో టీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భువనగరి ఎంపీ స్థానానికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి జానారెడ్డిపై పోటీ చేసిన నర్సింహయ్య ఘన విజయం సాధించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









