సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సైబరాబాద్ సీపీ
- December 01, 2020
హైదరాబాద్:నాంపల్లిలోని వ్యాయామ్ శాల హై స్కూల్ లో ఈరోజు ఉదయం సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అయన సతీమని అనుప వీ సజ్జనార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపించండని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు ఎన్ని ఇతర పనులు ఉన్నప్పటికీ ప్రతిఒక్కరూ కచ్చితంగా ఓటు వేసేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలను కోరారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కలిపి మొత్తం 51,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సైబరాబాద్ లో ఎన్నికల కు సంబంధించి భద్రతాపరంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఓట్ ఫస్ట్.. వర్క్ నెక్స్ట్ అనే నేనాదంతో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రజలందరూ పెద్దఎత్తున ముందుకు రావాలన్నారు. తాను ఓటు వేసిన వ్యాయామ్ శాల పాఠశాల వద్ద ఏర్పాట్లు బాగున్నాయన్నారు. ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారన్నారు. నగరంలోని ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించాలన్నారు. మాస్కులు, శానిటైజర్ వాడటంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.


తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







