శివసేనలోకి చేరిన 'రంగీలా' నటి
- December 01, 2020ముంబయి: బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్ మంగళవారం శివసేనలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్పై పోటీ చేసి పరాజయం చెందిన 46 ఏళ్ల ఊర్మిళ గత ఏడాది సెప్టెంబర్లో కాంగ్రెస్ను విడిచిపెట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసంలో ఆయన సమక్షంలో ఆమె శివసేనలో చేరారు.
కాగా..గవర్నర్ కోటాలో ఊర్మిళ పేరును శాసన మండలి సభ్యత్వానికి ఇటీవలనే గవర్నర్ బిఎస్ కోష్యారీకి శివసేన సిఫార్సు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది ఉత్తర ముంబయి లోక్సభ స్థానంలో పోటీ చేసి బిజెపి అభ్యర్థి గోపాల్ షెట్టి చేతిలో ఓడిపోయిన ఊర్మిళ ఇటీవల ముంబయిని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరుతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ