తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు..

- December 02, 2020 , by Maagulf
తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు..

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో సోమవారం రాత్రి 8గంటల నుంచి మంగళవారం రాత్రి 8గంటల వరకు 51,562 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 565 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,70,883కి చేరింది. గత 24గంటల్లో ఒకరు మాత్రమే కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,462కి చేరింది. ఇక, కరోనా వైరస్ నుంచి నిన్న 925 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 2,60,155కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,266 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 7,219 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 55,51,620కి చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com