యూఏఈ నేషనల్ డే వేడుకల వేళ దేశ గర్వాన్ని చాటుతూ కవిత విడుదల చేసిన షేక్ మొహమ్మద్
- December 02, 2020
యూఏఈ:49వ జాతీయ దినోత్సవ వేడుకల వేళ...యూఏఈ ప్రజల సుఖ సంతోషాలు కోరుతూ, దివంగత పాలకులకు నివాళులు అర్పిస్తూ, జాతి గర్వాన్ని చాటుతూ కవితను విడుదల చేశారు ఆ దేశ ఉపాధ్యక్షుడు షేమ్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. తన కవితను అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ కమాండ్ షేక్ మొహమ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్ కు అంకితం ఇస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక మాండలికం, క్లాసికల్ అరబిక్ సాహిత్యం కలగలిపి రాసిన తన కవితకు 'ఏ నేషనల్ డే' అనే శీర్షికను పెట్టారు షేక్ మొహమ్మద్. తన కవితలో యూఏఈ వ్యవస్థాపక పాలకులు, దివంగత షేక్ జయాద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్, షేక్ జయాద్ మొహమ్మద్ బిన జయాద్ లను కీర్తిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. అంతేకాదు..నిశీతమైన దృఢ భక్తి చింతన, దేశం పట్ల, పాలకులు, ప్రజల పట్ల తన ప్రేమాభిమానాన్ని ఆత్మీయంగా వ్యక్తపరిచారు. యూఏఈ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వారి ఆకాంక్షలు నేరవేరాలని, యూఏఈ ఎప్పటికీ టాప్ లో ఉండాలని తన కవితలో కోరుకున్నారాయన.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే
- తమిళనాడులో ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం..
- ‘ఓణత్తాళం’ కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్ రెడ్డి
- బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు
- దుబాయ్: కార్మికుల వసతి గదిలో ఒక్కొక్కరికి 3.7 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి
- హైదరాబాద్లో ‘న్యూ ఐడెంటిటీ’ ఫ్లాగ్షిప్ స్టోర్ ప్రారంభం
- తెలంగాణ పోలీస్లో వనరుల ఆప్టిమైజేషన్..రూ.90 కోట్లకు పైగా ఆదా
- అమరావతి అభివృద్ధి పై CRDA కీలక నిర్ణయాలు
- గుడ్ న్యూస్..డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ







