యూఏఈ నేషనల్ డే వేడుకల వేళ దేశ గర్వాన్ని చాటుతూ కవిత విడుదల చేసిన షేక్ మొహమ్మద్
- December 02, 2020
యూఏఈ:49వ జాతీయ దినోత్సవ వేడుకల వేళ...యూఏఈ ప్రజల సుఖ సంతోషాలు కోరుతూ, దివంగత పాలకులకు నివాళులు అర్పిస్తూ, జాతి గర్వాన్ని చాటుతూ కవితను విడుదల చేశారు ఆ దేశ ఉపాధ్యక్షుడు షేమ్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. తన కవితను అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ కమాండ్ షేక్ మొహమ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్ కు అంకితం ఇస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక మాండలికం, క్లాసికల్ అరబిక్ సాహిత్యం కలగలిపి రాసిన తన కవితకు 'ఏ నేషనల్ డే' అనే శీర్షికను పెట్టారు షేక్ మొహమ్మద్. తన కవితలో యూఏఈ వ్యవస్థాపక పాలకులు, దివంగత షేక్ జయాద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్, షేక్ జయాద్ మొహమ్మద్ బిన జయాద్ లను కీర్తిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. అంతేకాదు..నిశీతమైన దృఢ భక్తి చింతన, దేశం పట్ల, పాలకులు, ప్రజల పట్ల తన ప్రేమాభిమానాన్ని ఆత్మీయంగా వ్యక్తపరిచారు. యూఏఈ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వారి ఆకాంక్షలు నేరవేరాలని, యూఏఈ ఎప్పటికీ టాప్ లో ఉండాలని తన కవితలో కోరుకున్నారాయన.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







