ఇండియన్ ప్రొఫెషనల్స్ నెట్వర్క్ (ఐపీఎన్)ని ప్రారంభించిన ఎంబసీ
- December 04, 2020
కువైట్ సిటీ:కువైట్లో భారత ఎంబసీ, 'ఇండియన్ ప్రొఫెషనల్స్ నెట్వర్క్' (ఐపీఎన్)ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కువైట్లో భారత ప్రొఫెషనల్స్ మరియు ఎక్స్పర్ట్లకు ఇది చక్కని వేదిక అని ఎంబసీ పేర్కొంది. ఆయా విభాగాల్లో నైపుణ్యం, విజ్ఞానం కలిగి వున్న ఒపఫెషనల్స్ ఈ వేదికను ఉపయోగించుకోవాలని ఎంబసీ కోరింది. భారతదేశం అత్యాధునిక ప్రగతిని సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్రా కీలకమని, ఈ విభాగంలో అందరూ కలిసి పనిచేయాలని ఎంబసీ సూచించింది. సైంటిస్టులు, అకడమికియన్స్, ప్రొఫెసర్స్, మెడికల్ ప్రొఫెషనల్స్, మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్, చార్టెర్డ్ అకౌంటెంట్స్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ఎకనమిస్ట్లు, స్కాలర్స్ తదితరులు ఈ వేదికను పంచుకోవచ్చు. ఈ లింక్ (https://forms.gle/pgPXsvFeCBiwvGsr9) ద్వారా ఆయా విభాగాలకు చెందినవారు రిజిస్టర్ చేసుకోవడానికి వీలుంది. ట్విట్టర్ హ్యాండిల్ని కూడా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం [email protected]. మెయిల్ చేయవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!







