'జీ 5'లో డిసెంబర్ 4న 'కోమాలి' ప్రీమియర్
- December 04, 2020తెలుగు వీక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్, వెబ్ షోలు అందిస్తున్న ఓటీటీ వేదిక 'జీ 5'. లాక్డౌన్లో డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు... 'అమృతం ద్వితీయం' వెబిసోడ్స్తో వీక్షకులను ఎంటర్టైన్ చేశారు. డిసెంబర్ 4న మరో కొత్త సినిమాను తీసుకొస్తున్నారు. తమిళ హీరో 'జయం' రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'కోమాలి' శుక్రవారం 'జీ 5'లో ఎక్స్క్లూజివ్గా ప్రీమియర్ కానుంది.
పదహారేళ్లు కోమాలో ఉన్న ఓ వ్యక్తి మళ్లీ ఈ లోకంలోకి వస్తే? అనే కథాంశంతో 'కోమాలి' రూపొందింది. పదహారేళ్లకు, ఇప్పటికి సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. మారిన పరిస్థితులకు కథానాయకుడు అలవాటు పడ్డాడా? పదహారేళ్ల క్రితం సమాజంలో ఉన్న కథానాయకుడు చేసే పనులు ఏమిటి? అనేది ఆసక్తికరం. ఇదొక వినోదాత్మక చిత్రమని 'జీ 5' వర్గాలు తెలియజేశాయి.
'జయం' రవి కథానాయకుడిగా, కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సంయుక్తా హెగ్డే సెకండ్ హీరోయిన్. స్కూల్ డేస్ లో హీరోని ప్రేమించిన అమ్మాయిగా, హీరో కోమా నుండి తిరిగొచ్చే సమయానికి మరొకరిని పెళ్లి చేసుకున్న మహిళగా కనిపిస్తారు. కమెడియన్ యోగిబాబు, హీరో జయం రవి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. ఎమ్మెల్యేగా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'హిప్ హాప్' తమిళ సంగీత దర్శకుడు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..