తెలంగాణలో కొత్తగా 596 కరోనా కేసులు
- December 05, 2020హైదరాబాద్:తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా రాష్ట్రంలో 596 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2,72,719కి చేరింది. అలాగే… శుక్రవారం వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1470కి చేరింది. తెలంగాణలో శుక్రవారం 921 మంది వ్యాాధి బారి నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 2,62,751కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8498 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 6465 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. తెలంగాణలో డెత్ రేటు 0.53 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 96.34 శాతంగా ఉంది.
తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం 59,471 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసింది. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 57,22,82కి చేరింది. 803 టెస్టుల రిపోర్ట్స్ రావాల్సి ఉంది. GHMC పరిధిలో కొత్తగా 102 కేసులు వెలుగుచూశాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 47, రంగారెడ్డి జిల్లాలో 46, కరీంనగర్ జిల్లాలో 36 కేసులు నమోదయ్యాయి. నారాయణ పేటలో మాత్రం నిన్న ఒక్క కేసు కూడా నమోదుకాలేదు.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి