కోవిడ్ నిబంధనల్ని పాటించని వలసదారులను దేశ బహిష్కరణ
- December 05, 2020మస్కట్:కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు నిర్దేశించబడిన నిబంధనల్ని ఉల్లంఘించారన్న కారణంగా 33 మంది వలస కార్మికుల్ని బహిష్కరించనున్నారు. అల్ బతినా, దోఫార్, ముసాందం మరియు అల్ షర్కియా సౌత్ గవర్నరేట్స్లో 42 మందిపై ఈ మేరకు అభియోగాలు మోపబడ్డాయి. వీరిలో 9 మంది ఒమనీయులు వున్నారు. ఎక్కువమంది గుమికూడటం, మాస్క్లు ధరించకపోవడం వంటి ఉల్లంఘనలకు నిందితులు పాల్పడ్డారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు నిందితులపై విచారణ జరిగింది, న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. మూడు నెలల జైలు శిక్ష అలాగే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా నిందితులకు విధించారు. విదేశీయుల్ని దేశం నుంచి పంపెయ్యాలని న్యాయస్థానం ఆదేశించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..