కోవిడ్ నిబంధనల్ని పాటించని వలసదారులను దేశ బహిష్కరణ
- December 05, 2020మస్కట్:కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు నిర్దేశించబడిన నిబంధనల్ని ఉల్లంఘించారన్న కారణంగా 33 మంది వలస కార్మికుల్ని బహిష్కరించనున్నారు. అల్ బతినా, దోఫార్, ముసాందం మరియు అల్ షర్కియా సౌత్ గవర్నరేట్స్లో 42 మందిపై ఈ మేరకు అభియోగాలు మోపబడ్డాయి. వీరిలో 9 మంది ఒమనీయులు వున్నారు. ఎక్కువమంది గుమికూడటం, మాస్క్లు ధరించకపోవడం వంటి ఉల్లంఘనలకు నిందితులు పాల్పడ్డారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు నిందితులపై విచారణ జరిగింది, న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. మూడు నెలల జైలు శిక్ష అలాగే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా నిందితులకు విధించారు. విదేశీయుల్ని దేశం నుంచి పంపెయ్యాలని న్యాయస్థానం ఆదేశించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు