కోవిడ్ నిబంధనల్ని పాటించని వలసదారులను దేశ బహిష్కరణ
- December 05, 2020
మస్కట్:కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు నిర్దేశించబడిన నిబంధనల్ని ఉల్లంఘించారన్న కారణంగా 33 మంది వలస కార్మికుల్ని బహిష్కరించనున్నారు. అల్ బతినా, దోఫార్, ముసాందం మరియు అల్ షర్కియా సౌత్ గవర్నరేట్స్లో 42 మందిపై ఈ మేరకు అభియోగాలు మోపబడ్డాయి. వీరిలో 9 మంది ఒమనీయులు వున్నారు. ఎక్కువమంది గుమికూడటం, మాస్క్లు ధరించకపోవడం వంటి ఉల్లంఘనలకు నిందితులు పాల్పడ్డారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు నిందితులపై విచారణ జరిగింది, న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. మూడు నెలల జైలు శిక్ష అలాగే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా నిందితులకు విధించారు. విదేశీయుల్ని దేశం నుంచి పంపెయ్యాలని న్యాయస్థానం ఆదేశించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







