కోవిడ్ నిబంధనల్ని పాటించని వలసదారులను దేశ బహిష్కరణ
- December 05, 2020
మస్కట్:కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు నిర్దేశించబడిన నిబంధనల్ని ఉల్లంఘించారన్న కారణంగా 33 మంది వలస కార్మికుల్ని బహిష్కరించనున్నారు. అల్ బతినా, దోఫార్, ముసాందం మరియు అల్ షర్కియా సౌత్ గవర్నరేట్స్లో 42 మందిపై ఈ మేరకు అభియోగాలు మోపబడ్డాయి. వీరిలో 9 మంది ఒమనీయులు వున్నారు. ఎక్కువమంది గుమికూడటం, మాస్క్లు ధరించకపోవడం వంటి ఉల్లంఘనలకు నిందితులు పాల్పడ్డారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు నిందితులపై విచారణ జరిగింది, న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. మూడు నెలల జైలు శిక్ష అలాగే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా నిందితులకు విధించారు. విదేశీయుల్ని దేశం నుంచి పంపెయ్యాలని న్యాయస్థానం ఆదేశించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







