జయలలిత వర్థంతి సంధర్భంగా 'తలైవి' కొత్త స్టిల్స్ విడుదల
- December 05, 2020
చెన్నై:జయలలిత ఈ పేరు తెలియని వారు ఉండరనే చెప్పుకోవాలి. తమిళ ప్రజతకు ఈమె దేవత. అమ్మా భోజనం అని ప్రతి బీదవాడికి ఒక్క రూపాయికే భోజనం అందించింది. ఇలాంటివి మరెన్నో సంక్షేమ పథకాలను తమిళ ప్రజలకు అందించింది. ఇంతటి గొప్ప నాయకురాలి కథను సినిమా చిత్రంచనున్నారు. అయితే కాంట్రవర్సీ క్వీన్ కంగనా ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ముంబై ప్రభుత్వాన్ని విశ్లేషిందని ముంబై పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసును నమోదు చేశారు. ఇటువంటివి మరెన్నో దాంతో వివాదాల రాణిగా కంగనా పేరు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం కంగానా తమిళనాడుకు వరుసగా ఆరుసార్లు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన జే జయలలిత జీవిత కథలో నటిస్తోంది. ఈ సినిమాలో కంగనా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ఎల్ అజయ్ దర్శకత్వంలో తెరకెక్కతోంది. ఇందులో ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామీ మరి కొందరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే నేడు జయలలిత వర్ధంతి సందర్భంగా కంగనా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అచ్చం జయలలిత చీర కట్టులో కంగనా కనిపించింది. అయితే ఈ ఫొటోలతో పాటు జయమ్మ వర్థంతి సందర్భంగా మా సినిమా తలైవి సినిమా నుంచి కొన్ని ఫొటోలను మా టీమ్ పంచుకున్నారు. ఈ రెవుల్షనరీ సినిమాకు టీమ్ లీడర్ అజమ్ చాలా కష్టపడుతున్నారు. ఇంతటి గొప్ప నాయకుల కథ చేయడం సంతోషంగా ఉంది. ఇంక ఒక్క వారంమాత్రమే ఉందంటూ ట్వీట్ చేసింది. మరి ఈ సినిమాలో జయలలితగా కంగనా ఎంతవరకు మెప్పిస్తుందొ చూడాలి.
తాజా వార్తలు
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు







