కొత్త పార్లమెంటు భవన శంకుస్థాపనకు డిసెంబర్ 10న భూమిపూజ

- December 05, 2020 , by Maagulf
కొత్త పార్లమెంటు భవన శంకుస్థాపనకు డిసెంబర్ 10న భూమిపూజ

న్యూ ఢిల్లీ:కొత్త పార్లమెంటుకు ముహూర్తం ఫిక్స్ పార్లమెంటు కొత్త భవన శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది . డిసెంబర్ 10 న ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్నారు. రూ .861.9 కోట్ల వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగంతస్తుల భారీ రాజసౌధం నిర్మించనున్నారు . టాటా సంస్థ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది . 21 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది . కరోనా కాలంలో భారీ నిధులు వెచ్చించి భవనం నిర్మిస్తుండటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి .

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com