తెలంగాణ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

- December 06, 2020 , by Maagulf
తెలంగాణ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరగడం ప్రారంభించాయి.  తాజా బులెటిన్ ప్రకారం కొత్తగా రాష్ట్రంలో 622 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,341కి చేరింది.  ఇందులో 2,63,744 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8125 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  తాజా బులెటిన్ ప్రకారం తాజాగా కరోనాతో ఇద్దరు మృతి చెందారు.  దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1472కి చేరింది.  ఇక తాజా బులెటిన్ ప్రకారం నిన్న ఒక్కరోజు 993 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com