భారత్ లో కొత్తగా 36,011 కరోనా కేసులు

- December 06, 2020 , by Maagulf
భారత్ లో కొత్తగా 36,011 కరోనా కేసులు

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  దేశంలో ఇప్పటికే 96 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 36,011 కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,44,222 కి చేరింది.  ఇందులో 91,00,792 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,03,248 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 482 మంది కరోనాతో మృతిచెందారు.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 1,40,182కరోనా మరణాలు సంభవించాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 41,970 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com