శాస్త్రవేత్తను రిమోట్ గన్తో కాల్చి చంపారు..వారిపై కోపంతో ఊగిపోతున్న ఇరాన్
- December 07, 2020
టెహ్రాన్: తమ శాస్త్రవేత్తను రిమోట్ కంట్రోల్ గన్ వాడి చంపారని ఇరాన్ అధికారులు అన్నారు. అయితే ఇటీవల ఇరాన్ న్యూక్లియర్ శాస్త్రవేత్త మోహ్సెన్ ఫఖ్రిజాదే మరణించిన విషయం తెలిసిందే. అయితే దానికి యూఎస్, ఇజ్రాయిల్లే కారణమని ఇరాన్ అన్నది. తమ దేశ హక్కుల కోసం పోరాడేందుకు ఎంతవరకైనా వెళతామని ఇరాన్ వారు తెలిపారు. అంతేకాకుండా ఈ దేశాలు తమ సాహసోపేత పద్దతులు తమ వద్దనే ఉంచుకోవాలని అప్పట్లో ప్రకటించింది. అయితే ఈ విషయం పై ఇరాన్ మరో కొత్త విషయం బయటపెట్టింది. తమ శాస్త్రవేత్త శాటిలైటు ద్వారా కంట్రోల్ చేయబడే మిషన్ గన్ ద్వారా చంపబడ్డాడని తెలిపింది. దానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ గన్ను వాడారని ఇరాన్ డిప్యూటీ కమాండర్ తెలిపారు. 'మోహ్సెన్ తన కారులో దేశ రాజధాని టెహ్రాన్ బయట రహదారిలో వెళుతున్నాడు. అప్పటికీ అతను దాదాపు 11మంది గార్డులతో వెళ్లారు. అప్పుడే కారులో ఉన్న అతనిపై మిషన్ గన్ జూమ్ అయ్యింది. అతని ముఖం ఫోకస్ అయిన వెంటనే 13రౌండ్లు కాల్చింద'ని రియర్ అడ్మిరల్ అలి ఫదావి తెలిపారు.
అంతేకాకుండా ఆ గన్ను కేవలం అతడి చంపడానికే అమర్చబడిందని, లేదంటే కేవలం 10 అంగుళాల దూరంలో అతడి పక్కనే ఉన్న అతడి భార్యకు ఏమీ కాలేదని తెలిపారు. ఈ గన్ను ఆన్లైన్ ద్వారా కంట్రోల్ చేశారు. అంతేకాకుండా టార్గెట్ను గుర్తించేందుకు అత్యాధునిక కెమెరా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను వాడారు. ఆ ప్రాంతంలో ఎటువంటి టెర్రరిస్టులు కూడా లేరని అధికారులు తెలిపారు. దీనికి కారణం ఇజ్రాయిల్కు చెందిన ముజహదీన్ ఆఫ్ ఇరాన్(ఎంఈకే)నే దీనికి కారణం అని ఇరాన్ అన్నారు.
తాజా వార్తలు
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్.. ముడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!
- 2,818 ఆయుధాలు అప్పగించిన కువైటీలు..!!
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు









