ఎగ్జిట్ వీసా ఓవర్ స్టేయింగ్కి 1,000 సౌదీ రియాల్స్ జరీమానా
- December 08, 2020
సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్, ఎగ్జిట్ వీసా ఓవర్ స్టేయింగ్పై హెచ్చరికలు జారీ చేసింది. ఎగ్జిట్ వీసా కలిగి వుండి, ఎక్కువ కాలం నిబంధనలకు విరుద్ధంగా వుంటోన్నవారికి 1,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించడం జరుగుతుందని ఆ హెచ్చరికల్లో పేర్కొన్నారు. వీసా పొందిన వ్యక్తి, వీసా గడువు తీరినా దేశంలో వుంటే, వీసాని క్యాన్సిల్ చేసుకుని, కొత్తది పొందడానికి 1,000 సౌదీ రియాల్స్ జరీమానా చెల్లించాల్సి వస్తుందని ట్విట్టర్లో పేర్కొన్నారు అధికారులు. వలసదారుడి ఐడెంటిటీ కార్డు చెల్లుబాటయ్యేలా వుంటేనే, ఆ ప్రాసెస్ పూర్తి చేయడానికి వీలవుతుంది. ఓ వర్కర్ విషయమై ఎగ్జిట్ వీసా తన వద్దకు వచ్చిందనీ, రెసిడెన్సీ పర్మిట్ కూడా గడువు తీరినా, ఆ వ్యక్తి దేశం విడిచి పోలేదనీ ఓ ఎంప్లాయర్ మినిస్ట్రీని ఆశ్రయించడం జరిగింది. దాంతో, మినిస్ట్రీ నుంచీ ఈ స్పందన వచ్చింది. గత నెలలో సౌదీ అరేబియా, మేజర లేబర్ రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. జాబ్ మొబిలిటీ, ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసా జారీ (ఎంప్లాయర్స్ అప్రూవల్ లేని వలస కార్మికుల కోసం) వంటివి ఇందులో ముఖ్యమైనవి. ఈ రిఫార్మ్స్ వల్ల లక్షలాది మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉపశమనం పొందారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







