కరోనావైరస్ వ్యాక్సీన్ అధ్యయనం కోసం హైదరాబాద్ చేరుకున్న 64 దేశాల రాయబారులు
- December 09, 2020



కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థను సందర్శించటానికి భారతదేశంలోని 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు బుధవారం హైదరాబాద్ వచ్చారు.
దేశంలో కోవిడ్ వ్యాక్సీన్ అభివృద్ధి గురించి ప్రపంచ దేశాలకు తెలియజేయటం కోసం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ పర్యటనను ఏర్పాటు చేసింది.
దిల్లీ కేంద్రంగా పనిచేసే విదేశాల రాయబారులు, దౌత్యాధికారుల బృందం ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ భారత్ బయోటెక్, బయోలాజికల్-ఇ సంస్థలను సందర్శిస్తుంది.
ఈ సందర్భంగా దేశంలో కరోనా వ్యాక్సీన్ల తయారీ, పురోగతి గురించి విదేశీ ప్రతినిధులు తెలుసుకుంటారు. టీకాల అభివృద్ధిపై ప్రదర్శనను తిలకిస్తారు. అనంతరం శాస్త్రవేత్తలతో భేటీ అవుతారు.
వీరు రెండు బృందాలుగా విడిపోతారు. ఒక బృందం భారత్ బయోటెక్ను, మరొక బృందం బయోలాజికల్-ఇని సందర్శిస్తుంది. కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రం తిరిగి బయల్దేరి వెళతారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







