ఇజ్రాయిల్:తొలి వాక్సిన్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ కే...
- December 09, 2020
ఇజ్రాయిల్:కరోనా వైరస్ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నది.ఇప్పటికే కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు.లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. అయితే, ఫైజర్ కంపెనీ తయారు చేసిన వాక్సిన్ కు అత్యవసర అనుమతులు మంజూరు చేస్తున్నాయి అనేక దేశాలు. 80 లక్షల డోసుల ఫైజర్ వాక్సిన్ కోసం ఇజ్రాయిల్ ప్రభుత్వం ఫైజర్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.ఇందులో భాగంగా మొదటగా ఫైజర్ సంస్థ లక్ష డోసులను పంపించింది. తొలివిడతగా ఇజ్రాయిల్ చేరుకున్న ఆర్డర్ ను రిసీవ్ చేసుకోవడానికి ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.అక్కడ మీడియాతో మాట్లాడారు.ఫైజర్ సంస్థ వాక్సిన్ కు అత్యవసర అనుమతులు ఇంకా మంజూరు కాలేదు.త్వరలోనే అనుమతులు మంజూరు అవుతాయని, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు కాగానే మొదటి వాక్సిన్ను తానే వేయించుకుంటానని ప్రధాని పేర్కొన్నారు.దీంతో పాటు అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ తయారు చేసిన వాక్సిన్లను ఇజ్రాయిల్ ఆర్డర్ చేసింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







