ఇజ్రాయిల్:తొలి వాక్సిన్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ కే...
- December 09, 2020ఇజ్రాయిల్:కరోనా వైరస్ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నది.ఇప్పటికే కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు.లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. అయితే, ఫైజర్ కంపెనీ తయారు చేసిన వాక్సిన్ కు అత్యవసర అనుమతులు మంజూరు చేస్తున్నాయి అనేక దేశాలు. 80 లక్షల డోసుల ఫైజర్ వాక్సిన్ కోసం ఇజ్రాయిల్ ప్రభుత్వం ఫైజర్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.ఇందులో భాగంగా మొదటగా ఫైజర్ సంస్థ లక్ష డోసులను పంపించింది. తొలివిడతగా ఇజ్రాయిల్ చేరుకున్న ఆర్డర్ ను రిసీవ్ చేసుకోవడానికి ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.అక్కడ మీడియాతో మాట్లాడారు.ఫైజర్ సంస్థ వాక్సిన్ కు అత్యవసర అనుమతులు ఇంకా మంజూరు కాలేదు.త్వరలోనే అనుమతులు మంజూరు అవుతాయని, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు కాగానే మొదటి వాక్సిన్ను తానే వేయించుకుంటానని ప్రధాని పేర్కొన్నారు.దీంతో పాటు అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ తయారు చేసిన వాక్సిన్లను ఇజ్రాయిల్ ఆర్డర్ చేసింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన