ఇజ్రాయిల్:తొలి వాక్సిన్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ కే...

- December 09, 2020 , by Maagulf
ఇజ్రాయిల్:తొలి వాక్సిన్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ కే...

ఇజ్రాయిల్:కరోనా వైరస్ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నది.ఇప్పటికే కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు.లక్షలాది మంది మృత్యువాత పడ్డారు.  అయితే, ఫైజర్ కంపెనీ తయారు చేసిన వాక్సిన్ కు అత్యవసర అనుమతులు మంజూరు చేస్తున్నాయి అనేక దేశాలు. 80 లక్షల డోసుల ఫైజర్ వాక్సిన్ కోసం ఇజ్రాయిల్ ప్రభుత్వం ఫైజర్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.ఇందులో భాగంగా మొదటగా ఫైజర్ సంస్థ లక్ష డోసులను పంపించింది. తొలివిడతగా ఇజ్రాయిల్ చేరుకున్న ఆర్డర్ ను రిసీవ్ చేసుకోవడానికి ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.అక్కడ మీడియాతో మాట్లాడారు.ఫైజర్ సంస్థ వాక్సిన్ కు  అత్యవసర అనుమతులు ఇంకా మంజూరు కాలేదు.త్వరలోనే అనుమతులు మంజూరు అవుతాయని, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు కాగానే మొదటి వాక్సిన్ను తానే వేయించుకుంటానని ప్రధాని పేర్కొన్నారు.దీంతో పాటు అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ తయారు చేసిన వాక్సిన్లను ఇజ్రాయిల్ ఆర్డర్ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com