పనస ఇన్‌ఫ్రా మరియు డెవలపర్స్‌ ప్రారంభం

- December 11, 2020 , by Maagulf
పనస ఇన్‌ఫ్రా మరియు డెవలపర్స్‌ ప్రారంభం

హైదరాబాద్:రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకునేందుకు పనస ఇన్‌ఫ్రా అండ్‌ డెవలపర్స్‌ సంస్థ సరికొత్తగా ఆవిర్భవించింది. డిసెంబర్‌ 10న ఈ సంస్థ ప్రారంభోత్సవం జరిగింది హైద్రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ రోడ్డులో గల శ్రీ పవిత్ర బిల్డింగ్‌లో సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్‌మోహన్‌, బొంతు శ్రీదేవి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని, సంస్థ పురోభివృద్ధి సాధించాలని, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పనస ఇన్‌ఫ్రా అండ్‌ డెవలపర్స్‌ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రవి కుమార్ పనస ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com