అమెరికాకి క్రిస్మస్,న్యూఇయర్ భయం...
- December 11, 2020
అమెరికా:అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్నటి రోజున రికార్డ్ స్థాయిలో 3124 మరణాలు సంభవించాయి. ఇటీవలే జరిగిన థాంక్స్ గివింగ్ వేడుకల కోసం అమెరికన్లు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేశారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుక తరువాత పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. ఈ సమయంలోనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో క్రిస్మన్, న్యూఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ ఏడాది క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలకు ప్రజలు దూరంగా ఉండాలని, కనీసం మూడు నుంచి ఆరువారాల పాటు జాగ్రత్తగా ఉండాలని, ప్రయాణాలు, సామూహాలుగా చేరడం వంటివి కొంతమేర తగ్గించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి నిపుణుల సలహాలను ప్రజలు పాటిస్తారా? చూడాలి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







