పబ్లిక్ ఫార్మసీలో మందుల పక్కదారి..ఇద్దరు ఫార్మసిస్టుల అరెస్ట్

- December 11, 2020 , by Maagulf
పబ్లిక్ ఫార్మసీలో మందుల పక్కదారి..ఇద్దరు ఫార్మసిస్టుల అరెస్ట్

మనామా:ప్రజలకు అందాల్సిన మందులను పక్కదారి పట్టించారు ఇద్దరు ఫార్మాసిస్టులు. దాదాపు 38 వేల బహ్రెయిన్ దినార్స్ విలువైన టాబ్లెట్లను పక్కదారి పట్టించారు. అయితే..దొంగతనం చాన్నాళ్లు ఆగదు కదా..! మనోళ్ల బండారం కూడా అధికారుల తనిఖీల్లో బయటపడింది. బహ్రెయిన్ లోనే అతిపెద్ద పబ్లిక్ ఫార్మసి అయిన సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ ఫార్మసీలో ఈ చోరీ చోటు చేసుకుంది. ఫార్మసీలో పని చేసే ఇద్దరు ఫార్మసిస్టులు..తమ ఇంటికి, బంధువులకు, తెలిసిన వారి కోసం ప్రభుత్వ ఫార్మసీ నుంచి టాబ్లెట్లను ఎత్తుకెళ్లేవారు. అలాగే ఏకంగా 38 వేల బహ్రెయిన్ దినార్ల విలువ చేసే 2,44,000 ప్రిస్కిప్షన్ మందులను దొంగిలించారు. ఫార్మసీలో ఉద్యోగాలను అడ్డుగా పెట్టుకొని ప్రజా సంపదను దోచుకోవటంతో పాటు ప్రభుత్వ విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు అరెస్ట్ చేసిన అధికారులు..వారిని క్రిమినల్ ఉన్నత న్యాయస్థానం ముందు హజరు పరిచారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com