ఏలూరు ఘటన పై ప్రాథమిక నివేదిక గురించి ఉపరాష్ట్రపతికి వివరించిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి
- December 12, 2020
న్యూ ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు పట్టణంలో అంతు చిక్కని వ్యాధి సృష్టిస్తున్న అయోమయం గురించి తెలుసుకునేందుకు రంగంలోని దిగిన కేంద్ర వైద్య బృందాలు సమస్య గురించి వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ని ఈ రోజు ఢిల్లీలోని ఆయన నివాసంలో, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఉమ్మడి కార్యదర్శి లవ్ అగర్వాల్, ఇతర అధికారులు కలిశారు. ప్రస్తుతం ఏలూరులో పరిస్థితి గురించి తమ ప్రాథమిక నివేదిక అందిందని, తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
ఏలూరులో అంతు చిక్కని వ్యాధి కలకలం రేపిన నేపథ్యంలో వెంటనే ఉపరాష్ట్రపతి ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు అధికారులతో చర్చించగా, ఉపరాష్ట్రపతి చొరవతో ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన నిపుణులు, పూణెకు చెందిన వైరాలజిస్టుల బృందం ఈ నెల 8న ఏలూరు వచ్చి వివిధ కోణాల్లో వ్యాధి గురించి అధ్యయనం చేస్తున్న విషయం విదితమే.
ఏలూరులో వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర ఆరోగ్య బృందాల ప్రాథమిక అధ్యయన నివేదికను ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉపరాష్ట్రపతికి వివరించారు. సమగ్ర నివేదికను కేంద్ర బృందాలు ఢిల్లీ చేరాక సిద్ధం చేస్తామని, అవసరమైన ఆరోగ్య సూచనలు రాష్ట్రానికి ఇస్తామని తెలియజేశారు.
ప్రస్తుతం ఏలూరులో కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించిందని, 11వ తేదీన రెండు కేసులు మాత్రమే నమోదైన విషయాన్ని ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు.
ఏలూరులో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని వారికి ఉపరాష్ట్రపతి సూచించారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









