డిసెంబర్ 23 నుంచి ఖతార్ లో పంటల మహా సంత మహసీల్ ఫెస్టివల్
- December 12, 2020
ఖతార్: వ్యవసాయ క్షేత్రాల నుంచి తాజా పళ్లు, కూరగాయాలు, ఇతర ఉత్పత్తులతో ఏర్పాటు చేసే పంటం పండగ మహసీల్ ఫెస్టివల్ మళ్లీ ప్రజల ముందుకు రానుంది. ఈ నెల 23 నుంచి జనవరి 2 వరకు మహసీల్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు కల్చరల్ విలేజ్ ఫౌండేషన్-కతార స్పష్టం చేసింది. ఖతార గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తులతో ఫెస్టివల్ నిర్వహించటం వరుసగా ఇది ఐదో ఏడాది కావటం విశేషం. డిసెంబర్ 23 నుంచి ప్రారంభం అయ్యే ఫెస్టివల్ ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని కతార వెల్లడించింది. అంతేకాదు..మార్చి 31 వరకు ప్రతి గురు, శుక్ర, శనివారాల్లో కూడా మహసీల్ ఫెస్టివల్ కొనసాగుతుందని వివరించింది. స్థానికంగా పండించే పళ్లు, కూరగాయలతో 40 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు, ఖతారీ తేనే, ఖర్చూరలు, ఇతర ఆహార ఉత్పత్తులతో మరో 27 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు కతార స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







