డిసెంబర్ 23 నుంచి ఖతార్ లో పంటల మహా సంత మహసీల్ ఫెస్టివల్
- December 12, 2020
ఖతార్: వ్యవసాయ క్షేత్రాల నుంచి తాజా పళ్లు, కూరగాయాలు, ఇతర ఉత్పత్తులతో ఏర్పాటు చేసే పంటం పండగ మహసీల్ ఫెస్టివల్ మళ్లీ ప్రజల ముందుకు రానుంది. ఈ నెల 23 నుంచి జనవరి 2 వరకు మహసీల్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు కల్చరల్ విలేజ్ ఫౌండేషన్-కతార స్పష్టం చేసింది. ఖతార గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తులతో ఫెస్టివల్ నిర్వహించటం వరుసగా ఇది ఐదో ఏడాది కావటం విశేషం. డిసెంబర్ 23 నుంచి ప్రారంభం అయ్యే ఫెస్టివల్ ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని కతార వెల్లడించింది. అంతేకాదు..మార్చి 31 వరకు ప్రతి గురు, శుక్ర, శనివారాల్లో కూడా మహసీల్ ఫెస్టివల్ కొనసాగుతుందని వివరించింది. స్థానికంగా పండించే పళ్లు, కూరగాయలతో 40 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు, ఖతారీ తేనే, ఖర్చూరలు, ఇతర ఆహార ఉత్పత్తులతో మరో 27 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు కతార స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









