అబుధాబి టోల్ గేట్ సిస్టమ్ లో అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న 70,000 మంది వాహనదారులు
- December 13, 2020
అబుధాబి:అబుధాబిలో టోల్ గేట్ సిస్టమ్ ను ప్రకటించిన వారంలోనే వాహనదారుల నుంచి చెప్పుకోదగ్గ స్పందన కనిపించింది. ఇప్పటివరకు మొత్తం 70 వేల మంది వాహనదారులు తమ అకౌంట్లను యాక్టివేట్ చేసుకున్నట్లు అబుధాబిలోని సమీకృత రవాణా కేంద్రం(ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్) అధికారులు వెల్లడించారు. వాహనదారులు చూపిన చొరవకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
అబుధాబిలోని నాలుగు బ్రిడ్జిల మీదుగా ప్రయాణించే వాహనాలకు టోల్ గేట్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఐటీసీ..టోల్ ఫీజులను జనవరి 2 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు గత శనివారమే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు అంతా టోల్ గేట్ అకౌంట్లను రిజిస్టర్ చేసుకొవాలని, గతంలోనే రిజిస్టర్ చేసుకున్న వారు అకౌంట్లను యాక్టివేట్ చేసుకోవాలని కోరింది. ఐటీసీ నుంచి ప్రకటన వెలువడిన వారంలోనే 70 వేల మంది డర్బ్ ద్వారా తమ అకౌంట్లను యాక్టివేట్ చేసుకున్నారు.
టోల్ గేట్ సిస్టమ్ యాక్టివేట్ చేసుకోని వారు https://darb.itc.gov.ae ద్వారాగానీ, డర్బ్ యాప్ ద్వారాగానీ వాహన యజమానులు టోల్ గేట్ అకౌంట్లను యాక్టీవేట్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. డర్బ్ అకౌంట్ రిజిస్ట్రేషన్ కోసం Dh100 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో Dh50 బ్యాలెన్స్ రూపంలో వాహనదారుడి ఖాతాలో జమ అవుతుంది. టోల్ ఛార్జీని Dh4గా నిర్ధారించారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









