అబుధాబి టోల్ గేట్ సిస్టమ్ లో అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న 70,000 మంది వాహనదారులు
- December 13, 2020
అబుధాబి:అబుధాబిలో టోల్ గేట్ సిస్టమ్ ను ప్రకటించిన వారంలోనే వాహనదారుల నుంచి చెప్పుకోదగ్గ స్పందన కనిపించింది. ఇప్పటివరకు మొత్తం 70 వేల మంది వాహనదారులు తమ అకౌంట్లను యాక్టివేట్ చేసుకున్నట్లు అబుధాబిలోని సమీకృత రవాణా కేంద్రం(ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్) అధికారులు వెల్లడించారు. వాహనదారులు చూపిన చొరవకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
అబుధాబిలోని నాలుగు బ్రిడ్జిల మీదుగా ప్రయాణించే వాహనాలకు టోల్ గేట్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఐటీసీ..టోల్ ఫీజులను జనవరి 2 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు గత శనివారమే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు అంతా టోల్ గేట్ అకౌంట్లను రిజిస్టర్ చేసుకొవాలని, గతంలోనే రిజిస్టర్ చేసుకున్న వారు అకౌంట్లను యాక్టివేట్ చేసుకోవాలని కోరింది. ఐటీసీ నుంచి ప్రకటన వెలువడిన వారంలోనే 70 వేల మంది డర్బ్ ద్వారా తమ అకౌంట్లను యాక్టివేట్ చేసుకున్నారు.
టోల్ గేట్ సిస్టమ్ యాక్టివేట్ చేసుకోని వారు https://darb.itc.gov.ae ద్వారాగానీ, డర్బ్ యాప్ ద్వారాగానీ వాహన యజమానులు టోల్ గేట్ అకౌంట్లను యాక్టీవేట్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. డర్బ్ అకౌంట్ రిజిస్ట్రేషన్ కోసం Dh100 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో Dh50 బ్యాలెన్స్ రూపంలో వాహనదారుడి ఖాతాలో జమ అవుతుంది. టోల్ ఛార్జీని Dh4గా నిర్ధారించారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







