అబుధాబి టోల్ గేట్ సిస్టమ్ లో అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న 70,000 మంది వాహనదారులు
- December 13, 2020అబుధాబి:అబుధాబిలో టోల్ గేట్ సిస్టమ్ ను ప్రకటించిన వారంలోనే వాహనదారుల నుంచి చెప్పుకోదగ్గ స్పందన కనిపించింది. ఇప్పటివరకు మొత్తం 70 వేల మంది వాహనదారులు తమ అకౌంట్లను యాక్టివేట్ చేసుకున్నట్లు అబుధాబిలోని సమీకృత రవాణా కేంద్రం(ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్) అధికారులు వెల్లడించారు. వాహనదారులు చూపిన చొరవకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
అబుధాబిలోని నాలుగు బ్రిడ్జిల మీదుగా ప్రయాణించే వాహనాలకు టోల్ గేట్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఐటీసీ..టోల్ ఫీజులను జనవరి 2 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు గత శనివారమే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు అంతా టోల్ గేట్ అకౌంట్లను రిజిస్టర్ చేసుకొవాలని, గతంలోనే రిజిస్టర్ చేసుకున్న వారు అకౌంట్లను యాక్టివేట్ చేసుకోవాలని కోరింది. ఐటీసీ నుంచి ప్రకటన వెలువడిన వారంలోనే 70 వేల మంది డర్బ్ ద్వారా తమ అకౌంట్లను యాక్టివేట్ చేసుకున్నారు.
టోల్ గేట్ సిస్టమ్ యాక్టివేట్ చేసుకోని వారు https://darb.itc.gov.ae ద్వారాగానీ, డర్బ్ యాప్ ద్వారాగానీ వాహన యజమానులు టోల్ గేట్ అకౌంట్లను యాక్టీవేట్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. డర్బ్ అకౌంట్ రిజిస్ట్రేషన్ కోసం Dh100 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో Dh50 బ్యాలెన్స్ రూపంలో వాహనదారుడి ఖాతాలో జమ అవుతుంది. టోల్ ఛార్జీని Dh4గా నిర్ధారించారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..