అబుధాబి టోల్ గేట్ సిస్టమ్ లో అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న 70,000 మంది వాహనదారులు
- December 13, 2020అబుధాబి:అబుధాబిలో టోల్ గేట్ సిస్టమ్ ను ప్రకటించిన వారంలోనే వాహనదారుల నుంచి చెప్పుకోదగ్గ స్పందన కనిపించింది. ఇప్పటివరకు మొత్తం 70 వేల మంది వాహనదారులు తమ అకౌంట్లను యాక్టివేట్ చేసుకున్నట్లు అబుధాబిలోని సమీకృత రవాణా కేంద్రం(ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్) అధికారులు వెల్లడించారు. వాహనదారులు చూపిన చొరవకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
అబుధాబిలోని నాలుగు బ్రిడ్జిల మీదుగా ప్రయాణించే వాహనాలకు టోల్ గేట్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఐటీసీ..టోల్ ఫీజులను జనవరి 2 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు గత శనివారమే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు అంతా టోల్ గేట్ అకౌంట్లను రిజిస్టర్ చేసుకొవాలని, గతంలోనే రిజిస్టర్ చేసుకున్న వారు అకౌంట్లను యాక్టివేట్ చేసుకోవాలని కోరింది. ఐటీసీ నుంచి ప్రకటన వెలువడిన వారంలోనే 70 వేల మంది డర్బ్ ద్వారా తమ అకౌంట్లను యాక్టివేట్ చేసుకున్నారు.
టోల్ గేట్ సిస్టమ్ యాక్టివేట్ చేసుకోని వారు https://darb.itc.gov.ae ద్వారాగానీ, డర్బ్ యాప్ ద్వారాగానీ వాహన యజమానులు టోల్ గేట్ అకౌంట్లను యాక్టీవేట్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. డర్బ్ అకౌంట్ రిజిస్ట్రేషన్ కోసం Dh100 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో Dh50 బ్యాలెన్స్ రూపంలో వాహనదారుడి ఖాతాలో జమ అవుతుంది. టోల్ ఛార్జీని Dh4గా నిర్ధారించారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు