ఈనెల 17న మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
- December 13, 2020
బెంగుళూరు:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 17న పీఎస్ఎల్వీ సీ-50 ప్రయోగం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈనెల 17 మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు పీఎస్ఎల్వీ – సీ50 రాకెట్ ద్వారా 1,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్-01 అనే ఉపగ్రహన్ని నింగిలోకి పంపనుంది. ఈమేరకు వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ అనుసంధానం చేసిన దృశ్యాలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది.
ఈ ఉపగ్రహం ప్రయోగించిన అనంతరం మొదట 18వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూబదిలీ కక్ష నుంచి 36వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్షలోకి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు. సీఎంఎస్ భారతదేశపు 42వ కమ్యూనికేషన్ ఉప్రగహం. ఈ సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్పెక్ర్టంలో విస్తరించిన సీ బ్యాండ్ సేవలను అందించేందుకు నిర్దేశించారు. ఈ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం వల్ల భారత్తో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్ష్యదీప్లకు మెరుగైనా బ్రాడ్ బ్యాండ్ సేవలు అంతరాయం లేకుండా అందించవచ్చు. ఈ ఉపగ్రహం ఏడు సంవత్సరాల పాటు కక్షలో తిరుగుతూ సేవలు అందిస్తుంది. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ సిరీస్లో ఇది 22వ ప్రయోగం అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిషన్ అని కూడా వెల్లడించింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు