కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులతో హోం మంత్రి అమిత్ షా భేటీ
- December 13, 2020
న్యూ ఢిల్లీ:ఢిల్లీలో రైతు సంఘాల ఆందోళన ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో హోం మంత్రి అమిత్ షా చర్చల పరంపర కొనసాగిస్తున్నారు. ఎలాగైనా రైతులు, రైతు సంఘాల నేతలను ఆందోళన నుంచి విరమింపచేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మొన్ననే రైతు సంఘాల నేతల్ని చర్చకు పిలిచి చర్చించినా రైతులు ఆందోళన విరమించలేదు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై వ్యవసాయశాఖ మంత్రులతో అమిత్ షా సమావేశం నిర్వహించారు. అమిత్ షా నివాసంలో జరుగుతోన్న ఈ భేటీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి సోం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!









