కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులతో హోం మంత్రి అమిత్ షా భేటీ

- December 13, 2020 , by Maagulf
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులతో హోం మంత్రి అమిత్ షా భేటీ

న్యూ ఢిల్లీ:ఢిల్లీలో రైతు సంఘాల ఆందోళన ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో హోం మంత్రి అమిత్ షా చర్చల పరంపర కొనసాగిస్తున్నారు. ఎలాగైనా రైతులు, రైతు సంఘాల నేతలను ఆందోళన నుంచి విరమింపచేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మొన్ననే రైతు సంఘాల నేతల్ని చర్చకు పిలిచి చర్చించినా రైతులు ఆందోళన విరమించలేదు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై వ్యవసాయశాఖ మంత్రులతో అమిత్ షా సమావేశం నిర్వహించారు. అమిత్ షా నివాసంలో జరుగుతోన్న ఈ భేటీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి సోం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com