కువైట్ ప్రవాసులతో సమావేశమైన స్పీకర్ కోడెల

- May 28, 2015 , by Maagulf
కువైట్ ప్రవాసులతో సమావేశమైన స్పీకర్  కోడెల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గురువారం నాడు కువైట్ లో అక్కడి స్ధానిక ప్రవాసులతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున వారికి సహాయ సహకారాలు అందిస్తామని కోడెల వారికి తెలిపారు. అనంతరం ఎన్.టి.ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. కువైట్ లోని భారత్ రాయబారితో అక్కడి వారి సమస్యలపై చర్చించారు. 

ఈ కార్యక్రమంలో సుధాకరరావు కుధరవల్లి, ఓలేటి దివాకర్,బలరాం, సీతారాం, పట్టాభి, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం కువైట్ తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించే మహానాడుకి ముఖ్య అతిధిగా కోడెల హాజరవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com