తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు
- December 16, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో ప్రతి రోజు పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల వరకు నమోదు కాగా, తాజాగా పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 536 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 2,79,135 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం 1502 మంది కరోనాతో మరణించారు. ఇక తాజాగా 622 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు 2,70,450 మంది కోలుకున్నారు.
మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7,183 ఉండగా, హోం ఐసోలేషన్ లో 5,041 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. రాష్ట్రంలో రికవరీ రేటు 96.88 శాతం ఉండగా, దేశంలో 95.2 శాతం ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 107 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







