గల్ఫ్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని తహశీల్దార్ కు వినతి పత్రం

- December 18, 2020 , by Maagulf
గల్ఫ్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని తహశీల్దార్ కు వినతి పత్రం

తెలంగాణ:నేడు అంతర్జాతీయ వలస కార్మిక దినోత్సవం సందర్భంగా గల్ఫ్ జేఏసీ చేపట్టిన గల్ఫ్ భరోసా యాత్రలో భాగంగా  గల్ఫ్ కార్మికుల వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చెయ్యాలని తెలంగాణ రాష్ట్రం అంతటా  MRO లకు వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టారు.

ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల తహశీల్దార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనగామ శ్రీనివాస్ (సామాజిక సేవకులు), కోండ భానుచందర్ (ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్), రాంరెడ్డి (ప్రవాసమిత్ర సింగపూర్) చీకోటి మహేశ్, శరత్, రమేష్  తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com