యూకేలో మళ్లీ లాక్డౌన్..
- December 20, 2020లండన్: యూకేలో క్రిస్మస్ వేడుకలకు బ్రేక్ పడింది. కొత్తరకం కరోనా వైరస్ పంజా విసురుతుండటంతో దేశం మళ్లీ లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. మూడు రోజులుగా బ్రిటన్ లో నమోదవుతున్న కరోనా కేసుల్లో 60 శాతానికి పైగా కొత్త రకం వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వైరస్ 70 శాతం వేగంగా వ్యాపిస్తుందని అధికారులు వెల్లడించారు. దీంతో వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు లండన్ తో పాటు దక్షిణ ఇంగ్లాండ్లో లాక్డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం.
నిన్నటి నుంచి లాక్డౌన్ అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో క్రిస్మస్ ఫెస్టివల్ నిర్వహించుకోలేకపోతున్నామని ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లో ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని యూకే వైద్యాధికారులు చెబుతున్నారు. ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండాలని సూచించారు. అప్రమత్తంగా లేకపోతే కొత్త వైరస్కు గురికావల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!