యూకేలో మళ్లీ లాక్డౌన్..
- December 20, 2020
లండన్: యూకేలో క్రిస్మస్ వేడుకలకు బ్రేక్ పడింది. కొత్తరకం కరోనా వైరస్ పంజా విసురుతుండటంతో దేశం మళ్లీ లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. మూడు రోజులుగా బ్రిటన్ లో నమోదవుతున్న కరోనా కేసుల్లో 60 శాతానికి పైగా కొత్త రకం వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వైరస్ 70 శాతం వేగంగా వ్యాపిస్తుందని అధికారులు వెల్లడించారు. దీంతో వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు లండన్ తో పాటు దక్షిణ ఇంగ్లాండ్లో లాక్డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం.
నిన్నటి నుంచి లాక్డౌన్ అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో క్రిస్మస్ ఫెస్టివల్ నిర్వహించుకోలేకపోతున్నామని ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లో ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని యూకే వైద్యాధికారులు చెబుతున్నారు. ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండాలని సూచించారు. అప్రమత్తంగా లేకపోతే కొత్త వైరస్కు గురికావల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







