లైసెన్స్ లేని ఆన్లైన్ జ్యుయెలరీ అమ్మకాలపై కఠిన చర్యలు
- December 21, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ కామర్స్ అండ్ టూరిజం, సోషల్ మీడియా వేదికగా లైసెన్స్ లేకుండా జ్యుయెలరీ విక్రయిస్తున్నవారి పట్ల అప్రమత్తంగా వుండాలని పౌరుల్ని, నివాసితుల్ని హెచ్చరించింది. ఈ తరహా అమ్మకాల వల్ల మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం వుందని మినిస్ట్రీ చెబుతోంది. ఆన్లైన్ ద్వారా నడిచే ఇలాంటి అమ్మకాలపై నిఘా వుంచుతున్నామనీ, లైసెన్స్ లేకుండా విక్రయాలు జరుపుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ హెచ్చరించింది. ఇలాంటి మార్గాల ద్వారా నడిచే ఆర్థిక వ్యవహారాలు, టెర్రిస్ట్ ఫైనాన్సింగ్ కోసం మళ్ళే అవకాశం వుందని అంటోంది మినిస్ట్రీ. కమర్షియల్ రిజిస్టర్ చట్టం 27/2015 ప్రకారం ఈ తరహా విక్రయాలు నేరపూరితమైనవని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి మోసపూరిత అమ్మకాల్ని ఆన్లైన్లో గుర్తిస్తే వెంటనే వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







