బ్రిటన్లో విజృంభిస్తోన్న కొత్త రకం వైరస్,తెలంగాణలో ఇద్దరికి లక్షణాలు
- December 23, 2020
హైదరాబాద్:స్ట్రెయిన్గా రూపాంతరం చెందిన కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. బ్రిటన్లో కొత్త రకం వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రోజు వారిగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య 64.7 శాతానికి చేరింది. బ్రిటన్ నుంచి విమానాల రాకపోకల విషయంలో ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఆ దేశంతో ఉన్న సరిహద్దులను ఫ్రాన్స్ మూసివేసింది.ఈ నేపథ్యంలో ఇవాళ అత్యవసరంగా సమావేశం అవుతున్న WHO..కొత్త రకం వైరస్పై చర్చించనుంది. దాన్ని తట్టుకోవడం ఎలా? దాని నుంచి ప్రపంచ దేశాలకు ఉన్న ముప్పేంటి? ఏ విధంగా అప్రమత్తం చేయాలని దానిపై సభ్యులు చర్చించనున్నారు.
కొత్త వైరస్ నేపథ్యంలో అలజడి మొదలైంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 25 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. జన్యుమార్పిడి చెందిన వైరస్ కావొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణకు వచ్చిన ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కొత్త వైరస్ నిర్ధారణ కోసం నమూనాలను పుణె పంపారు అధికారులు. గత రెండు వారాల్లో బ్రిటన్ నుంచి 1500 మంది వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేయనుంది ప్రభుత్వం. స్ట్రెయిన్ మహమ్మారి కొత్తగా జడలు విప్పుతోన్న వేళ, కేరళలో కొత్తగా 6.049మందికి కరోనా సోకగా, రాష్ట్రంలో 27 మరణాలు సంభవించాయి. దీంతో కేరళ సర్కారు అప్రమత్తమైంది. తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు