ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త
- December 23, 2020
అమరావతి:ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు ఈనెల 29 వ తేదీన రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అందించే రూ.2వేల రూపాయల సహాయంతో పాటుగా ఇన్ ఫుట్ సబ్సిడీ మొత్తం కూడా రైతుల ఖాతాల్లో వేయబోతున్నారు.ఏపీ వ్యవసాయశాఖ ద్వారా రాష్ట్రంలోని 50.47 లక్షల మంది రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ కాబోతున్నాయి. మొదట ఇన్ ఫుట్ సబ్సిడీ అమౌంట్ ఈనెల 27 వ తేదీన జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించారు. అయితే, రెండు రోజుల వ్యవధిలో రైతు భరోసా పథకం కింద డబ్బులు అందజేయాలి కాబట్టి రెండు విడివిడిగా కాకుండా ఒకేరోజున రైతుల అకౌంట్ లో జమ కాబోతున్నాయి. న్యూ ఇయర్ కు రెండు రోజుల ముందుగానే రైతుల అకౌంట్ లోకి డబ్బులు జమ కాబోతుండటం మంచి విషయంగా చెప్పుకోవాలి.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









