భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కేసులు

- December 24, 2020 , by Maagulf
భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కేసులు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా వైరస్ కేసులు మరలా పెరుగుతున్నాయి.నిన్నటి వరకు తక్కువగా నమోదైన కేసులు ఈరోజు ఒక్కసారిగా మళ్ళీ పెరిగాయి. తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 24,712 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,01,23,778కి చేరింది.  ఇందులో 96,93,173 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,83,849 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 312 మంది మృతి చెందారు.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 1,46,756 మంది మృతి చెందారు.ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఇండియాలో 29,791 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com