వ్యాక్సినేషన్ ప్రారంభం: రెండో డోస్ వేసుకునేదాకా ప్రయాణాలొద్దు
- December 24, 2020
కువైట్: కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ఆరంభమయ్యింది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవాళ్ళకి రెండో వ్యాక్సిన్ తీసుకునేవరకూ ప్రయాణాలు చేయొద్దంటూ కువైట్ అథారిటీస్ సూచించాయి. మిష్రెఫ్లోని ఇంటర్నేషనల్ ఫెయిర్గ్రౌండ్స్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రైమ్ మినిస్టర్ షేక్ సబాహ్ అల్ ఖాలెద్ అల్ సబా వెల్లడించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏడాదిపాటు జరుగుతుందనీ, దేశంలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందని హెల్త్ మినిస్టర్ షేక్ డాక్టర్ బాజెల్ అల్ సబాహ్ చెప్పారు. వ్యాక్సిన్ పొందగోరువారు హెల్త్ మినిస్ట్రీ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. మంగలవారం నాటికి 83,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ప్రస్తుతానికి దేశంలో 150,000 కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో వున్నాయి. ఇవి 75,000 మందికి సరిపోతాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







